Wednesday, 10 December 2025 07:29:51 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

అనకాపల్లి జిల్లా పారిశ్రామిక అభివృద్ధి ధ్యేయం :: ఎంపీ సీఎం రమేష్

Date : 04 August 2024 02:33 PM Views : 1301

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ ఆదివారం ఆగస్టు 4:: అనకాపల్లి ఎంపి C.M రమేష్ తన కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్ కోర్టు తీర్పు చాలా సంతోషకరo అని అన్నారు. ఆలస్యమైనా ప్రధానమంత్రి చొరవతో న్యాయం జరిగిందనీ అన్నారు. అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు చేయడానికి కేంద్రమంత్రి ఘట్కరి తో చర్చించాగా వెంటనే టెండర్లు పిలిచి పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కలుపుతూ తుని నుండి కొత్తవలస వరకు అదనపు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. దానికి కూడా త్వరలో సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. అలాగే అనకాపల్లి జిల్లాలో కొన్ని ముఖ్యమైన స్టేషన్లో ఆగని కొన్ని రైళ్లు హాల్ట్ కల్పించాలని, కొన్ని స్టేషన్లో రైతుల సౌలభ్యం కోసం ట్రైన్ హాల్టింగ్ సమయం పెంచాలని కేంద్ర రైల్వే మంత్రిని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనకాపల్లి రైల్వే స్టేషన్ ను మోడరన్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కూడా రైల్వే మంత్రికి వినతిపత్రం ఇచ్చాను. మాడుగుల చోడవరం నియోజకవర్గాల పరిధిలో 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నాను... ఇప్పటికే పలు కంపెనీలు మన ఇండస్ట్రియల్ జోన్ లో కంపెనీలు నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. వారితో చర్చలు జరుగుతున్నాయి. చైనాలో మాదిరిగా ఈ ప్రాంతంలో ఫర్నిచర్ క్లస్టర్ నెలకొల్పి పెద్ద ఎత్తులో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాము... స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపు టిడిపి పోటీ చేస్తుందని, అభ్యర్థి ఎవరు అనేది సీఎం చంద్రబాబు నాయుడు మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించడం జరుగుతుందనీ అన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో mlc అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్, ప్రగడ నాగేశ్వరరావు, కొట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2025. All right Reserved.



Developed By :