Rapid TV - Andhra Pradesh / Anakapally : మెగాస్టార్ చిరంజీవికి దేశ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి చిరంజీవిని వారి నివాసంలో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా బైరా దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ స్వయంకృషితో చిరంజీవి సామాన్యుడి స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకున్నారని, సినిమా రంగానికి, కళాకారులకి ఎన్నో సేవా కార్యక్రమాలు తన సొంత నిధులతో చేశారని, కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని అటువంటి వ్యక్తికి ఈ పురస్కారం లభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చిరంజీవి తన ఆత్మీయ కుటుంబ సభ్యుడైన బైరా దిలీప్ చక్రవర్తి గారిని విజయం సాధించలని ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు తో ప్రేమతో దీవించారు.
Admin
Rapid TV