Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్కేం టివి రావికమతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల నశించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రావికమతంలో శుక్రవారం సదస్సు జరిగింది. సిఐటియు మండల కన్వీనర్ వజ్రపు సత్యవతి అధ్యక్షతన జరిగిన సదస్సులో సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చిందని ఇవి కార్మికులకు ఉరుతాడుగా భావించాలని అన్నారు. ఈ విషయాన్ని అన్ని రంగాల కార్మికులకు విస్తృతంగా ప్రచారం చేసి ఫిబ్రవరి 12వ జరుగు జాతీయ సమ్మెలో కార్మికుల యావత్తు భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మార్చి 12 గంటల పెంచటం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో కార్మికులకు పర్మినెంట్ చేయకుండా వెట్టి చాకిరి చేయించటం, కనీస వేతనాలు అమలు చేయకపోవడం, పని హక్కుకు గ్యారెంటీ లేకుండా చేయటం సమ్మెహక్కును హరించటం వంటి ప్రమాదకరమైన విధానాలు ఈ లేబర్ కోడ్ లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా,మధ్యాహ్న భోజన పథకం,ముఠా, ఆటో కార్మికులు ఎస్ సత్యవేణి కే దేవి, ఎస్ అమ్మాజీ బి సత్యవతి, దానయ్య దండిపాటీ శ్రీను మరియు ముఠా కార్మికులు ఆటో కార్మికులు ఆశా వర్కర్లు మధ్యాహ్నం భోజనం కార్మికులు అంగన్వాడీ వర్కర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు రోడ్ల కూడలిలో నిరసన చేపట్టి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Admin
Rapid TV