Rapid TV - Andhra Pradesh / Anakapally : జనవరి 21వ తేదీన అనకాపల్లిలో తన అభిమానులు కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గన అనకాపల్లి తన స్వగృహానికి కొణతల రామకృష్ణ బయలుదేరి వెళ్లారు. విశాఖ ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ అనకాపల్లిలో 21న కార్యకర్తల అభిమానులు సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని తెలియపరుస్తాననీ అన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలిశానని అన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్, పోలవరం, సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించానని అన్నారు. జనవరి 21వ తేదీ ఆదివారం తన అభిమానులు తో మాట్లాడి ఏ పార్టీలో చేరుతాను అనే అంశాన్ని వెల్లడిస్తాననీ అన్నారు. అసెంబ్లీకా, పార్లమెంట్క పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాననీ రామకృష్ణ తెలిపారు.
Admin
Rapid TV