Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి, రావికమతం : రైతు యొక్క సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చోడవరం శాసనసభ్యులు కే ఎస్ ఎన్ ఎస్ రాజు అన్నారు. సోమవారం మండలంలోని టీ అజ్జాపురం సచివాలయం వద్ద రైతులకు ఖరీఫ్ విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో విత్తనాలు అందజేయాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం త్వరగా విత్తనాలను రైతు భరోసా కేంద్రాలకు సచివాలయాలకు అందజేసిందని అన్నారు రైతుల యొక్క అభిప్రాయాలు మేరకు సుమారు తొమ్మిది రకాల విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు అర్హులైన వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదు వారి అకౌంట్లో త్వరలోనే జమ అవుతాయన్నారు. రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి సబ్సిడీ విత్తనాలను అవసరమైన మేరకు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడగల అర్జున ఫాలుగున మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజాన శ్రీవాణి కొండ నాయుడు తదితరులు హాజరయ్యారు.
Admin
Rapid TV