Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ఎస్ రాయవరం మండలంలో రైడ్ చేసి నాలుగు కేసులు నమోదు చెయ్యడం జరిగిందనీ స్థానిక ఎస్సై ప్రసాదరావు తెలిపారు. మూడు కోడిపందాల కేసులు,ఒక మద్యం కేసు ను నమోదు చెయ్యడం జరిగింది. దీనిలో 9 కోళ్లు, 6 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అదే విధముగా గత 3 రోజుల్లో మొత్తం 17 కేసులు నమోదు చెసి, మొత్తం 45 మందిని అరెస్ట్ చెయ్యడం జరిగిందనీ, 21 కోళ్లు స్వాధీనం చేసుకున్నామని, 19710/- నగదును సీజ్ చెసామని, 31 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Reporter
Rapid TV