Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి మండలం తగరంపూడి పంచాయతీ పరిధిలో ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు మరియు హాస్పిటల్ కమిటీ చైర్మన్ గొర్లి సూరిబాబు హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించి హాస్పిటల్ కావల్సిన సామాగ్రి ఇతర ఇతర సామాన్లు కొనుగోలుకు వివిధ అంశాలపై తీర్మానించారు. హాస్పిటల్లో మట్టి ఫిల్లింగ్, మొక్కలు వెయ్యడం కోసం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్ కుమార్, డాక్టర్లు జి పావని, డి నీలిమ రాణి, వైస్ ఎంపీపీ అయితే ఆనందరాము, ఎంపీటీసీలు పన్నీరు కొండలరావు, జోగా నాగేశ్వరరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV