Rapid TV - Andhra Pradesh / Anakapally : మాజీ మంత్రివర్యులు. స్థానిక శాసనసభ్యులు. కొణతాల రామకృష్ణ సోమవారం అనకాపల్లి పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా అనకాపల్లి పురపాలక సంఘంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. తక్షణం యాడ్ ను ఇక్కడ నుండి తరలించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా వున్న పెరుగుల బజార్ నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు ఉన్న రోడ్డును పరిశీలించారు. తక్షణం రోడ్డును నిర్మించాలని దానికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. మరియు బిల్డింగులు పోయిన బాధితులకు తక్షణం టిడిఆర్స్ ఇవ్వాలని దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చూడమని కమిషనర్ ను ఆదేశించారు. అక్కడ నుండే విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్ తో ఫోన్లో సంప్రదించి పైన తెలిపిన పనుల గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు మరియు 2004లో తాను మంత్రిగా ఉండగా నిర్మాణం చేసినటువంటి కాలువల లైనింగ్ పనులను పరిశీలించి వాటిని సిల్టు తీయించి శుభ్రముగా ఉంచాలని అలాగే రైతులకు నీరు పారడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో ఉన్న మురికి కాలువ అన్నిట్లోనూ వర్షాకాలం దృష్ట్యా ముందుగానే కాలువలో పేరుకుపోయిన సిల్ట్ మరియు వ్యర్ధ పదార్థాలను తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే విజయనగరం రోడ్డు లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అక్కడున్న రైల్వే బ్రిడ్జి రిపేర్లు చేయించి దాన్ని పరిశుభ్రపరిచి ఆ మట్టి చెత్త చెదారం అంతా తొలగించాలని ఆదేశించారు, అలాగే పట్టణంలో కావలసినటువంటి పలు మౌలిక వసతులు. రోడ్ల నిర్మాణాలు. మంచినీటి ఇబ్బందులు .శానిటేషన్ పై పలు సూచనలు చేసి ఉన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కావలసిన ఏర్పాట్లు చూడాలని దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. రూరల్ ప్రాంతంలో కూడా తనదైన శైలిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మన అనకాపల్లికి మంచి రోజులు వచ్చాయని కొణతాల పర్యటనను చూసిన స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు..
Admin
Rapid TV