Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అనకాపల్లిలో తెలుగుదేశం యువ నాయకులు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం జరిగాయి. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం మరియు రాజా ఆప్టికల్స్ కంటి ఆస్పత్రి అనకాపల్లి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో మందులను ఉచితముగా పంపిణీ చేశారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి దాడి రత్నాకర్ ఆర్థిక సహాయంతో ఉచితముగా కళ్ళజోళ్లను పంపిణీ చేశారు .అవసరమైన వారికి కంటి శుక్లాల ఆపరేషన్ లను శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా చేయిస్తామని ఆయన తెలిపారు.
Admin
Rapid TV