Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణను పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టిక్కెట్ను ఆశించి గత ఐదు సంవత్సరాలుగా అనకాపల్లిలో జనసేన ను గ్రామ గ్రామాన అభివృద్ధి పరిచిన పరుచూరి భాస్కర్ రావు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. అయినా జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ గెలుపుకు కృషి చేస్తానని జన సైనికులు కార్యకర్తలు నా అభిమానులు అందరూ జనసేన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆదివారం ఉదయం కొణతాల రామకృష్ణ తన అనుచరులతో పరుచూరి భాస్కరరావు కార్యాలయానికి వెళ్లారు. కొణతాల రామకృష్ణకు పరుచూరి భాస్కరరావు ఘన స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు. తన గెలుపుకు కృషి చేయాలని భాస్కరరావును కొణతాల కోరారు. ఈ సందర్భంగా పరుచూరి భాస్కరరావు మాట్లాడుతూ అధినేత అభిప్రాయానికి కట్టుబడి ఉంటామని, అనకాపల్లిలో జనసేన గెలుపుకు కృషి చేస్తామని, నేను జనసైనికులు, నా అభిమానులందరూ మీ గెలుపుకు పని చేస్తామని హామీ ఇచ్చారు.
Admin
Rapid TV