Rapid TV - Andhra Pradesh / Anakapally : రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాధ్ గారి జన్మదిన వేడుకలు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి.. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మెన్ కొణతాల మురళీకృష్ణ, ఈఓ బండారు ప్రసాద్ మరియు ధర్మకర్తలు బుద్ధ నర్సింగరాజు, పీలా లక్ష్మి శ్రీనివాసరావు, ఆడారి ఉమా శ్రీనివాసరావు, కొండూరు రవీంద్రనాధ్, గొల్లవిల్లి నర్సింగరావు, పాము అనురాధ సన్నిబాబు, కంటపల్లి శోభారాణి వెంకటరావు, మల్లవరపు ఈశ్వర్రావు, అర్చకులు యనమండ్ర శ్రీనివాస్, సందీప్ శర్మ లు మంత్రి అమరనాధ్ గారిని గజమాల, శాలువా తో సత్కరించి వేద పండితుల ఆశీర్వచనం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం, ప్రసాదం అందజేశారు.అమర్నాధ్ గారి శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోరుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో దేవి హోమం, అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ధర్మకర్తల మండలి సభ్యుల సౌజన్యం తో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం తో పాటు ఆలయ సిబ్బంది అందరికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన డా. రామమూర్తి, మందపాటి జానకిరామరాజు, జాజుల రమేష్, విల్లూరి శివసూరి లతో పాటు కొణతాల కృష్ణంరాజు,వేగి త్రినాధ్,ఉగ్గిన అప్పారావు మద్దాల సురేష్,కాండ్రేగుల రాము,రాయవరపు జోగిరాజు,పెంటకోట సన్యాసినాయుడు,డొంక సత్తిబాబు,దాడి తులసి, కారుకుండి కన్నబాబు,మేడిశెట్టి గణేష్,ఆవుపాటి మల్లేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కొణతాల మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఒక స్వచ్ఛమైన వ్యక్తిత్వం గల గుడివాడ అమరనాధ్ నేటి రాజకీయాలకే ఒక ఉన్నత గౌరవాన్ని తీసుకొచ్చారని, తాను స్వయంకృషి తో, సీఎం జగన్ గారు, వైస్సార్సీపీ నాయకులు మరియు అనకాపల్లి ప్రజల ఆశీస్సులతో.. శాసనసభ్యుడు గా, రాష్ట్ర మంత్రి గా ఎదగడం తో పాటు మాలాంటివారు ఎందరినో ఉన్నత పదవులలో నిలబెట్టి మాకందరికి ఆత్మీయ సోదరుడు గా నిలిచారని కొనియాడారు.
Admin
Rapid TV