Rapid TV - Andhra Pradesh / Anakapally : టౌన్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం. దీపిక యలమంచిలి, రాపిడ్ న్యూస్ : పట్నంలోని పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎం దీపిక గురువారం నాడు తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు మైనర్లు డ్రైవింగ్ చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ క్రమ బద్ధీకరించడం, విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయడం, రోడ్డు భద్రత నియమాలను యువతకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు, బెల్ట్ షాపుల పై పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకస్మిక/ డైనమిక్ తనిఖీలు నిర్వహించాలని అన్నారు. తరుచు రిపోర్ట్ అవుతున్న నేరాలు గురించి ఆరా తీశారు. పెండింగ్ కేసుల సీడీ ఫైల్స్ ను పరిశీలించి, ఆయా కేసుల పురోగతిని తెలుసుకుని తగు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. రౌడీ షీటర్స్, చెడునడత కలిగిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు గూర్చి ఆరా తీశారు. ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీపడదగ్గ కేసులను ఇరు పార్టీలకు కౌన్సిలింగ్ చేసి స్వచ్ఛందంగా రాజీ పడేలా చేసి తద్వారా కేసులు తగ్గించాలన్నారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను, చట్ట పరిధిలో రాజీపడే అవకాశం ఉన్న కేసులన్నింటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ, యలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. ధనుంజయ రావు, ఎస్ లు కె.సావిత్రి, బి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV