Wednesday, 10 December 2025 07:28:35 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

ఉచిత కంటి మెగా వైద్య శిబిరాలు పేదవారికి ఎంతో ఉపయోగం : సిఐ స్వామి నాయుడు

Date : 25 September 2025 07:28 PM Views : 43

Rapid TV - Andhra Pradesh / Anakapally : ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ సంక్షేమ సంఘం అనకాపల్లి వారి ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఫార్మాసిస్టుల సమైక్య సంఘం జనరల్ సెక్రెటరీ రత్నాల ప్రకాష్ పర్యవేక్షణలో రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి అనకాపల్లి, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం వారి సహకారంతో అనకాపల్లి మండలం బి ఆర్ టి కాలనీ లో శ్రీ శక్తి మెడికల్స్ వద్ద ఉచిత కంటి మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ స్వామినాయుడు మాట్లాడుతూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారి ప్రాణాలను కాపాడతాయని అన్నారు. ఉచిత కంటి మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదవారికి కంటి చూపును వారి జీవితాలలో వెలుగును ప్రసాదిస్తున్న రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి అధినేత పూసర్ల రాజా ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఉచిత కంటి మెగా వైద్య శిబిరంలో 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. 40 మందికి కళ్ళజోళ్లను తక్కువ ధరలకు అందించారు.ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎప్పుడు తన సహాయ సహకారాలు ఉంటాయని ci స్వామి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోల్లేటి శివాజీ, ఎల్లపు వెంకటరావు, శ్రీనివాసరావు, అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ చరపాక హేమంత్, ఫార్మసిస్ట్లు జి మంగయ్య, గిరిజా రాణి, డాక్టర్ నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2025. All right Reserved.



Developed By :