Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి :: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద రత్నకుమారి కొణతాల రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రపంచానికే ఆదర్శప్రాయుడని, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. పేద ప్రజలు కూడా ఆనందంగా జీవించాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ఆలోచన నుంచి పుట్టిందే కిలో రెండు రూపాయల బియ్యం, ప్రతి పేదవాడికి గృహమని అన్నారు.
Admin
Rapid TV