Rapid TV - Andhra Pradesh / Anakapally : తాండవ జలాశయ ప్రధాన గేట్లను మరమ్మత్తులు చేపట్టాలి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర డిమాండ్ *ఈ నెల 17న నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం* *నాతవరం* జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్ అయిన తాండవ జలాశయ ప్రధాన గేట్ల మరమ్మత్తులు చేపట్టాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం తాండవ జలాశయాన్ని సందర్శించి గేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గేట్ల మరమ్మత్తులు చేపట్టాలని ఎన్నో సార్లు ప్రభుత్వ దృష్టికి వివిధ రూపాల్లో తెలియజేశామన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఇటీవల వర్షాభావ పరిస్థితుల్లో సుమారు 28వేల ఎకరాల వరకు పంట పొట్ట దశలో ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు కనీసం గేట్ల మరమ్మత్తులపై ఎటువంటి దృష్టిసారించకపోవడం దారుణమన్నారు. తాండవ గేట్ల మరమ్మత్తులు చేపట్టేందుకు రైతుల పక్షాన జనసేన ఎప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. వచ్చే పంట కాలంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తక్షణమే 7లక్షల గ్రాంటు విడుదల చేసి మరమ్మత్తులు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన నిలబడాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 17న శనివారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ, మండల సంయుక్త కార్యదర్శి మంకు కృష్ణకుమార్, మాక్రెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గన్నారు
Reporter
Rapid TV