Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా.... రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు కుమార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే.. మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కొత్త తరహా పాలన అందిస్తానన్నారు. మూడుపార్టీల నాయకులు ఐక్యంగా పనిచేయడం వల్ల విజయం సులభమైందన్నారు. విజయానికి కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలా ముందుకెళ్లామని తెలిపారు. ప్రజలు చూపించిన అభిమానం మర్చిపోలేనిదన్నారు. ప్రజలకు, కష్టపడిన కార్యకర్తలకు నిత్యం గ్రామాల్లో అందుబాటులో ఉంటూ సుపరిపాలన ఇవ్వడానికి కలిసి పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ రాజాన సన్యాసి నాయుడు, రాజాన రమేష్ కుమార్, రంగనాయకులు, జనపరెడ్డి శ్రీనివాసరావు , రాందాస్, ప్రకాష్, నూకన దొర, దిన్ బాబు, నర్సింగరావు, దొడ్డి శ్రీను, బాపు నాయుడు, సాయిరాం..నాలుగు మండలాలు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV