Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం మండల కేంద్రంలో సోమవారం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన రాస్తారోకో మనోవహరం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసంగ ఆసంగ అధ్యక్షుడు గంజి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మొదట రావికమతం జడ్పీ హైస్కూల్ నుంచి ర్యాలీ గా ప్రారంభమై నాలుగు రోడ్లు కూడా నుంచి ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగింది, అనంతరం నాలుగు రోడ్లు కూడా వద్ద మనవహరంగా ఏర్పడి ధర్నా రాస్తా రోకో కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు గంజి శ్రీనివాసు కార్యదర్శి వియ్యపు శ్రీనివాసులు మాట్లాడుతూ దివ్యాంగులకు 6000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలి ఐదు లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇప్పించాలి దివ్యాంగ్ వివాహాలకు సంబంధించి మూడు లక్షలు వరకు నగదు ప్రోత్సాహం ఇవ్వాలి ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం స్కీములు మంజూరు చేయాలి 70 శాతం పైబడి ఉన్న వికలాంగులకు స్కూటీలు మూడు చక్రాల వాహనాలు అందజేయాలి తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది దివ్యాంగులు పాల్గొన్నారు
Admin
Rapid TV