Rapid TV - Andhra Pradesh / Anakapally : సమరసతా సేవా ఫౌండేషన్ యలమంచిలి మండల మావేశం మండల సంయోజకులు రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుండి 22వరకు ధర్మ రక్షాబంధన్ ప్రతి గ్రామంలో జరుపుకోవాలని నేను నీకు రక్ష,నీవు నాకు రక్ష, మనందరం కావాలి దేశానికి ధర్మానికి రక్ష అనుకుంటూ ఒకరికొకరు రక్షలు కట్టుకోవాలి అన్నారు.ప్రతి నెలలో రెండు ఏకాదశి వస్తాయి. ఏకాదశి రోజున ధార్మిక జట్టు తో నగర సంకీర్తన చేయాలని, వారం వారం దేవాలయ కేంద్రంగా భజన జరగాలని, ప్రతి పౌర్ణమి కి స్వామివారికి సామూహిక హారతి ఇవ్వాలన్నారు.ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు మాట్లాడుతూ సామూహిక హారతి ఇవ్వటం వల్ల మన ఇంట్లో, మన గ్రామంలో ఉండే ఏ దోషాలు అయినా స్వామి వారికి ఇచ్చే హారతిలో హరించిపోతాయని వివరించారు. ఈ కార్యక్రమలో పి.అమృతవల్లి,రాజాన మోహన్రావు , వేగి నాయుడు వి.వి.వి నరసింహనాయుడు,పి. లక్ష్మితదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV