Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లాలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత రక్షణ కొరకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల 14వ తేదీ నుండి బైక్ యాత్ర ప్రారంభిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం తెలిపారు అనకాపల్లిలో సిపిఎం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల భద్రత రక్షణకై తమ పార్టీ పనిచేస్తుందని, కార్మికుల రక్షణకై ఈనెల 14వ తేదీన పాయకరావుపేట నుండి బైక్ యాత్ర ప్రారంభిస్తామని ఈ యాత్ర 20వ తేదీ వరకు జరుగుతుందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జి కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ శంకరరావు, వివి శ్రీనివాసరావు, గంటా శ్రీరామ్, అల్లు రాజులు పాల్గొన్నారు.
Admin
Rapid TV