Rapid TV - Andhra Pradesh / Anakapally : *బూత్ స్థాయిలో టీడీపీ యువత, మహిళా కమిటీలు ఏర్పాటు* ... *కశింకోట గ్రామంలో కశింకోట మండల టీడీపీ ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులు* .... *బూత్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జీలకు ఓటరు వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, కుటుంబ సాధికార సారథులపై శిక్షణా తరగతులు* .... *టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వైకాపా అవినీతిని ప్రచారం చేయాలి* - *మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు* ,..... .....టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వైకాపా అవినీతిని, గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృధ్దిని ప్రచారం చేయాలని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు పిలుపునిచ్చారు.ప్రతి బూత్ స్థాయిలో టీడీపీ యువత, మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తున్నా మని అన్నారు.60రోజులు కష్టపడితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు.భవిష్యత్తు గ్యారెంటీ పధకాలను ప్రతి ఇంటికి, ప్రతి ఓటరుకు వివరించాలని కోరారు. ఈ రోజు కశింకోటలో జరిగిన కశింకోట మండల టీడీపీ ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులు కార్య క్రమంలో వారు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా బూత్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జీలకు ఓటరు వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, కుటుంబ సాధికార సారథులపై శిక్షణా తరగతులు నిర్వహించారు.ఆసరా పేరుతో 34లక్షల మంది డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా పెట్టాడు అని అన్నారు.జగన్ రెడ్డిని నమ్ముకొని చట్ట విరుద్ధంగా దొంగ ఓట్లను నమోదు చేసిన అధికారులూ జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి దొంగ ఓట్లతో మరొకసారి ముఖ్య మంత్రి అవ్వాలని కుట్ర పన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాడి రత్నాకర్, పీలా శ్రీకాంత్, కాయల మురళి, ఉగ్గీన రమణ మూర్తి, పెంటకోట రాము, సిద్ది రెడ్డి శ్రీనివాసరావు, వేగి గోపీకృష్ణ, కాండ్రేగుల సతీష్, ఆనాల తాతి నాయుడు, కృష్ణా,షేక్ బాబర్, ఒమ్మీ సత్యనారాయణ, ట్రైనర్ సురేశ్, విజయ్,శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV