Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం : విశాఖ జిల్లా కార్మిక ఉద్యమ నేత మాజీ సిఐటియు ప్రధాన కార్యదర్శి స్వర్గీయ కామ్రేడ్ రమేష్ ఏడవ వర్ధంతి సందర్భంగా చోడవరంలో ఆయన కు పలువురు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ కామ్రేడ్ రమేష్ తన జీవితాన్ని ప్రజాసంఘాల సేవలకు అంకితం చేసి, నిరంతరం ప్రజా శ్రేయస్సుకి పోరాటాలు చేశారని ముఖ్యంగా స్కీం వర్కర్లైన ఆశ ,అంగన్వాడి, మధ్యాహ్నం భోజనం కార్మికులు, ఇతర స్కీమ్ వర్కర్ల కోసం నిరంతరం కృషి చేసారని అలాంటి మహానేతను కోల్పోవడం తీరని లోటని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ నాయకులు కే వరలక్ష్మి బి రామలక్ష్మి ఎండియం కార్మికులు బుచ్చి రాజమ్మ తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV