Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో ఇందిరా కాలనీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలక మల్లిబాబు ఆధ్వర్యంలో, మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ, వర్గీకరణ పోరాటంలో అమరులైన నాయకులకు మౌనం పాటించారు. ఎస్సీలో ఉమ్మడి ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆయన కార్యాచరణలో ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన ఎమ్మార్పీ జెండాలు ఎగరవేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తా శ్రీనివాసరావు అన్నారు.సుప్రీంకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీస్ కార్యకర్తలు కేక్ కటింగ్ మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకంచేసారు ఎస్సీ లో ఉమ్మడి ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పుతోమరియు మాదిగ ఉద్యోగుల సంఘం చోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ కండెల్లి వెంకటరావు మాస్టారు, రెళ్లి హక్కుల పోరాటసంఘం రాష్ట్ర నాయకులు వరప్రసాద్, రేళ్లి సంఘం జిల్లా నాయకులు పొట్నూరి అప్పలరాజు, రెల్లి హక్కుల పోరాట సంఘం జిల్లా నాయకులు పొట్నూరి పొట్టి అప్పారావు, మాదిగ ఉద్యోగుల సంఘం యువ నాయకుడు ప్రదీప్, ఎలక రాజు, ఎలక అప్పారావు, మాదిగ మహిళలు పెద్దలు యువకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని పాలాభిషేకం చేశారు
Admin
Rapid TV