Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఆయన గురువారం అనకాపల్లి మహిళ పోలీస్ స్టేషన్లో ఆధునీకరించిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ మహిళల భద్రత కుటుంబాల్లో జరిగే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో ఈ కౌన్సిలింగ్ సెంటర్లు పాత్ర కీలకమని అన్నారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ కేంద్రం ద్వారా గృహింస కుటుంబ కలహాలు వాటి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో 2024 సంవత్సరంలో 667 పిటిషన్లు, 2025లో ఇప్పటివరకు 227 పిటిషన్లు వచ్చాయని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మొత్తం 719 దంపతుల సమస్యలు పరిష్కరించి, మళ్ళీ కలిసి జీవించేందుకు సహాయ పడడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు శ్రీ ఎం.దేవప్రసాద్, శ్రీ ఎల్.మోహనరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఇ.శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, విజయ్ కుమార్, అప్పలనాయుడు, బాల సూర్యరావు, వెంకటనారాయణ, ఎస్సైలు శిరీష, యమునా, అలీ షరీఫ్, శేఖరం, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
Admin
Rapid TV