Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : గత రెండు సంవత్సరాలుగా గంజాయి కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ అందించిన వివరాల ప్రకారం 2023 సంవత్సరంలో గంజాయి కేసులో పరారై తప్పించుకు తిరుగుతున్న నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన మాకిరెడ్డి రాజశేఖర్( 34) ను అరెస్టు చేశామని తెలిపారు. 2023 సంవత్సరంలో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు నమోదయ్యిందని, ఈ కేసులో 18 కేజీల గంజాయితో కూడిన కారును వదిలేసి, నిందితుడు పరారయ్యాడని, అప్పటి నుంచి అతడు పోలీసులను తప్పించుకుంటూ తిరుగుతున్నాడన్నారు.. నమ్మకమైన సమాచారం ఆధారంగా రూరల్ ఎస్ఐ పి రాజారావు మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పాత నేరస్తుడైన రాజశేఖర్ ను అరెస్టు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై పి రాజారావు పాల్గొన్నారు.
Reporter
Rapid TV