Rapid TV - Andhra Pradesh / Anakapally : *గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కు మంచి రోజులు ... ఉత్పత్తి పెరిగేలా ప్రణాళికలు ... *జిల్లాలో వైసీపీ ప్రభుత్వం లో మూసిన కర్మాగారలను ఇథనల్ తో అనుసంధానం చేసి రైతులుకు, స్థానిక యువతకు లాభదాయకంగా చేస్తాం ... *రైతులకు చెరుకు పేమెంట్లు వెంటనే అందేలా చర్యలు... *కార్మికులుకు అన్నీ విధాలుగా అండగా ఉంటాం అనకాపల్లి పార్లమెంట్ కి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ హామీ... *గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు నుండి చెబుతున్నాం గుర్తుపెట్టుకోండి.* *చోడవరం లో చెరుకు గానుగు రైతులతో ముచ్చట, బెల్లం తయారీ గురించి మరియు వారి సమస్యలు అడిగి తెలుసుకొని రైతన్నకు భరోసా.* *చెరుకు పండించేలా రైతులకు ప్రోత్సాహకలు అందజేస్తాము, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్ట్ తో వేల ఎకరాలకు మంచి చేకురుతుంది అని అనకాపల్లి ఎం.పీ అభ్యర్థి శ్రీ సీ.ఎం రమేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం చోడవరం నియోజకవర్గం గోవాడ లో కూటమి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ KSNS రాజు మరియు జనసేన ఇంచార్జి శ్రీ PVSN రాజుతో కలసి గోవాడ చక్కర కర్మాగారం గేటు ముందు స్థానిక కార్మికులు తో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీ.ఎం రమేష్ మాట్లాడుతు అనకాపల్లి జిల్లాలో గల షుగర్ ఫ్యాక్టరీల గురించి కొన్ని రోజులుగా అధ్యయనం చేస్తున్నాం అని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉన్న కర్మాగారలు మూసేసారు అని గోవాడ లో ఉన్న కర్మాగారం లో ఉత్పత్తి తగ్గిపోయింది అని రైతంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు అని జూన్ 4 వ తేదీ తరువాత ప్రభుత్వం మారుతుంది ఇక్కడ రాజు మంచి మెజారిటీ తో గెలుస్తున్నారు అని అదే విధంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కు మంచి రోజులు వస్తున్నాయి. ఉత్పత్తి పెరిగేలా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని జిల్లాలో వైసీపీ ప్రభుత్వం లో ముసిన కర్మాగారలను ఇథనల్ తో అనుసంధానం చేసి రైతులు ను స్థానిక యువతకు లాభదాయకంగా చేసే భాద్యత తీసుకుంటున్నాం అని ప్రధాన డిమాండ్లు పరిస్కారిస్తామని రైతులకు చెరుకు పేమెంట్లు వెంటనే అందెల చర్యలు తీసుకుంటాం అని కార్మికులుకు అన్నీ విధాలుగా అండగా ఉంటాం అని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు నుండి చెబుతున్నాం గుర్తుపెట్టుకోండి అని తెలియజేసారు.అనంతరం చోడవరం లో చెరుకు గానుగు రైతులతో ముచ్చటించారు వారు బెల్లం తయారీ గురించి అడిగి తెలుసుకొన్నారు. రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నా పట్టించుకోవడం లేదు అని తెలియజేయగా వారి సమస్యలుకు పరిస్కారం చూపిస్తాం అని రైతన్నకు భరోసా కల్పించారు.జిల్లాలో గల రైతాంగానికి చెరుకు పండించేలా రైతులకు ప్రోత్సాహకలు అందజేస్తాము, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్ట్ తో వేల ఎకరాలకు మంచి చేకురుతుంది అని తెలియజేసారు. కార్యక్రమం లో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Rapid TV