Wednesday, 29 July 2026 01:32:49 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

కేంద్ర హోం శాఖ సంప్రదింపులు కమిటీ సభ్యులుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

Date : 25 October 2024 07:30 PM Views : 365

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: కేంద్ర హోంశాఖ సంప్రదింపులు కమిటీ సభ్యులు గా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ నియామకం వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీల్లో రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలకు చోటు లభించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంప్రదింపులు కమిటీ సభ్యులు గా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ నియమితులయ్యారు.కేంద్ర హోం శాఖ సంప్రదింపుల కమిటీకి చైర్మన్ గా అమిత్ షా గారు వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సహాయ మంత్రులు తో పాటు 15 మంది లోక్సభ, మరియు 13మంది రాజ్యసభ, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు గా ఉంటారు అని కేంద్రం నుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సీ.ఎం రమేష్ స్పందిస్తూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కీలకమైన రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ,ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా మరియు ఇప్పుడు హోం శాఖ సంప్రదింపులో కమిటీలో సభ్యునిగా తనను నియమించినందుకుగాను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారికి మరియు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.తనను నమ్మి గురుతరమైన బాధ్యతలు అప్పగిస్తూ, ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.అదేవిధంగా అనకాపల్లి జిల్లావ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నాయకులకు,కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :