Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం రాపిడ్ టీవీ ఆగస్టు 4 :: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్ లో పడి ఒక వ్యక్తి మృతి. మృతుడు చీమలపాడు పంచాయతీ పరిధిలోని డూకులంపాడు గ్రామానికి చెందిన ఈదల సంజీవ్ 35 గా గ్రామస్థులు తెలిపారు. ఈ గ్రామం కళ్యాణ పులోవ రిజర్వాయర్కు ఎగువ భాగంలో ఉంది శనివారం సాయంత్రం ప్రమాదం జరిగిన అనంతరం ములకలాపల్లి నుంచి గజ ఈతగాళ్లను తీసుకువెళ్లి వెతికించినప్పటికీ మృతదేహం ఆచూకీ తెలియ రాలేదు. రిజర్వాయర్లో నీరు ఎక్కువగా ఉండటం గడ్డి బాగా ఉండటం వల్ల వెతకడం కష్టంగా ఉందని, నిన్న సాయంత్రం వెతకడం మానేశారు. ఈరోజు ఆదివారం ఉదయం మృత దేహం తేలినట్లుగా గ్రామస్తులు తెలిపారు. సంఘటన ఏ విధంగా జరిగిందో పూర్తి వివరాలు తెలియలేదు ప్రమాదవశాత్తు జరిగిందా ఎవరైనా కావాలని చేశారా అనే దానిపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
Admin
Rapid TV