Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : మున్సిపాలిటీలోని శారదానగర్ లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలిని గుర్తుతెలియని అగంతకులు బెదిరించి బంగారం ఎత్తుకుపోయిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం నర్సీపట్నం పట్టణ సిఐ జి గోవిందరావు అందించిన వివరాల ప్రకారం శారదా నగర్ ఎల్ఐసి బిల్డింగ్ వెనుక వైపు ఆర్ వెంకటలక్ష్మి అనే వృద్ధురాలు చాలా కాలంగా ఒంటరిగా నివసిస్తుందని, ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఉంటున్నారని తెలిపారు. శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక వైపు నుండి ఇంటిలో ప్రవేశించి వృద్ధురాలిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతులకు ఉన్న 8 గాజులు (సుమారు 10 తులాలు )దౌర్జన్యంగా లాక్కొని వెళ్లిపోయారన్నారు. కేసు నమోదు చేశామని క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ టీములు ఆధారాలు సేకరిస్తున్నారన్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలిస్తున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
Reporter
Rapid TV