Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవి అనకాపల్లి : అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని రోడ్లు చాలా సంవత్సరాలనుండి అద్వానంగా ఉన్నాయని వాటిని వెంటనే పునర్ నిర్మించాలని కోరుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను కలిసి వినతి పత్రం అందజేశారు. నర్సీపట్నం రోలుగుంట రావికమతం విజయరామరాజుపేట చోడవరం వెంకన్నపాలెం అనకాపల్లి వరకు రోడ్డు అధ్వానంగా ఉందని మధ్యలో విజయరామరాజుపేట వడ్డాది వద్ద బ్రిడ్జిలు కూలిపోయి ఉన్నాయని, అలాగే నర్సీపట్నం రేవు పోలవరం రోడ్డు కూడా పూర్తిగా మరమ్మతులకు గురైందని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు దీనిపై సానుకూలంగా సీఎం స్పందించి వెంటనే కార్యక్రమాలు చేపట్టేటట్టు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా ఎంపీ సీఎం రమేష్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.
Admin
Rapid TV