Rapid TV - Andhra Pradesh / Anakapally : జన సైనికుడు కసిరెడ్డి సర్వేశ్వరరావు చొరవతో లాలంకోడూరులో పర్యటించిన డి యి దుర్గాప్రసాద్ జెయి వర్మ లాలంకోడూరులో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరాకు అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కసిరెడ్డి సర్వేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి పరిస్థితి వివరించగా ఎమ్మెల్యే చొరవ తీసుకొని మండల డియి దుర్గా ప్రసాద్ కి ఫోన్ చేయగా డి యి దుర్గాప్రసాద్ జె యి వర్మ లాలంకోడూరు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం డి ఈ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో కరెంటు సప్లై సరిపోలేదని కరెంటు సప్లై కారణంగా గ్రామానికి మంచినీటి కొరత ఏర్పడిందని డి ఈ అన్నారు.పంచాయతీలో తీర్మానం పెట్టి త్రీ ఫేస్ కరెంటుకి ఏర్పాటు చేసుకోమని చెప్పారు. డి ఈ తో పాటు పంచాయతీ సెక్రెటరీ సంతోష్, ఎలక్ట్రికల్ లైన్ మాన్ యుగేందర్,జనసేన నాయకులు కసిరెడ్డి సర్వేశ్వరరావు,శేఖర్,వార్డు మెంబర్ పద్మ రమణారావు,కార్యదర్శి కట్టా అప్పారావు గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV