Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండలంలోని పులకండం పొన్నవోలు గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. గ్రామానికి చెందిన నలుగురు రైతులకు విద్యుత్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసింది. అయితే అది ఇటీవల కాలంలో మరమ్మతులకు గురి కావడంతో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతులు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించారు నేపథ్యంలో స్థానిక ఏ ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్ను అక్కడికి తీసుకువచ్చారు పాత ట్రాన్స్ఫార్మర్ను ఇప్పి కొత్త ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయబోతుండగా ఆ సమయంలో వర్షం రావడంతో ఆ పనులకు ఆటంకం కలగడంతో విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ వస్తువులను అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయారు ఇది గమనించిన దుండగులు రాత్రి సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్లారు. దీంతో ఏయి సంఘటన తెలుసుకొని అక్కడ చేరుకొని కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తోంది. ఇదిలా ఉండగా ట్రాన్స్ఫార్మర్ చో్రీ కి గురి కావడంతో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయమని పాత ట్రాన్స్ఫర్ దొరికిన తర్వాతే ట్రాన్స్ఫార్మర్ కొత్తది ఏర్పాటు చేస్తామని రైతులకు తెలపడంతో రైతులు ఆగ్రహించి కొత్తగా తెచ్చిన ట్రాన్స్ఫార్మర్ను సమీప వినాయకుని ఆలయంలో పెట్టి తాళం వేశారు. ట్రాన్స్ఫార్మర్ కు విద్యుత్తు కనెక్షన్ తీసివేయడం వల్లే చోరీకి గురైందని, మాకు ఎటువంటి సంబంధం లేనందున కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ రాజారావుతో విద్యుత్ శాఖ ఏఈ కి తెలియజేశారు, అయినప్పటికీ ఏవి మొండి వైఖరితో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయనని చెప్పడమే కాకుండా రైతులు సర్పంచ్ ఫోన్ చేసినప్పటికీ సమాధానం చెప్పడం లేదు. పొలాలు ఎండిపోతున్నాయని ఈ విషయమే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని రైతులు పోలిపల్లి కళ్యాణం, రాజులమ్మ గోపన్న, సత్తి బాబు విలేకరులకు తెలిపారు.
Admin
Rapid TV