Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవమును పురస్కరించుకొని పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఈవో శ్రీనివాస్ మూర్తి తెలిపారు. జిల్లా రెవెన్యూ, పోలీస్ మరియు జీవీఎంసీ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జులై 21 ఆదివారం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి నాలుగో విడత3 మడుగులు చందన సమర్పణ సంప్రదాయబద్దంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 20 శనివారం స్వామివారి ప్రచార రథం 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షణ జరుగుతుందని తెలిపారు. శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ప్రచార రథం సింహాద్రి అప్పన్న తొలి పావంచ వద్ద నుంచి గిరి ప్రదక్షిణ బయలుదేరనున్నట్లు ఈవో తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సమారుగా రెండు లక్షలు మంది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ఈవో తెలిపారు. అందుకు తగ్గట్టుగా కలెక్టర్ ఆదేశాల మేరకు దారి పొడవునా దేవస్థానం తో పాటు సేవా సంఘాలు మరియు స్వచ్ఛంద సంస్థలు, సహకారంతో భక్తులకు మంచినీరు, అన్నప్రసాదాలు దారి పొడుగునా 20 పాయింట్లు లో వితరణ గావించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరి ప్రదర్శన పూర్తి చేసుకున్న భక్తులకు రాత్రి 10:30 వరకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరుసటి రోజు తెల్లవారి ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడకుండా ఏర్పాటు చేశాం.భక్తులకు త్రాగడానికి త్రాగునీరు . మరుగుదొడ్లు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం అన్నారు అలాగే భక్తులకి కొండ దిగి నుండి కొండపైకి వెళ్లడానికి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు.... దేవాలయంలో అతి పెద్ద ఉత్సవం గిరిప్రదక్షిణ.. ముఖ్యంగా భక్తులు 5 లక్షలకు పైగా గిరి తిరుగుతారని ఒక అంచనాతో, వారికి 32 కిలోమీటర్ల దారిపోడవున మంచినీరు, మజ్జిగ, పాలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించామన్నారు.. ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఉత్సవాన్ని అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చెయ్యాలని కోరారు.. అదేవిధంగా దారి పొడవున సి. సి. కెమెరాలతో పోలీసులు మానిటరింగ్ చేస్తారని, ఈ సారి రోడ్లు కూడా జి. వి. ఏం. సి. అధికారులు భక్తులకోసం అందంగా తీర్చిదిద్దారని కొనియాడారు.. అదేవిధంగా స్వచంద సేవా సంస్థలు కూడా దారిపోడవున ప్రసాదాలను అందిస్తున్నారని తెలిపారు..గిరి ప్రదక్షిణ చుట్టూ పబ్లిక్ టాయిలెట్స్ ను, వైద్య సదుపాయాలను కల్పించారన్నారు.. గత చందనోత్సవం వలె, ఉచిత బస్సులలోనే భక్తులను కొండకు చెర వేస్తామ న్నారు.. వెహికల్స్ సింహాగిరిపైకి అనుమతి లేదని తెలిపారు..ఉత్సవాన్ని అధికారులు, దేవస్థానం సిబ్బంది స్వచ్ఛందంగా పనిచేసే భక్తులకు సేవచేసి వారికి అసౌకర్యం కలుగ కుండా చూడాలని తెలిపారు....
Reporter
Rapid TV