Rapid TV - Andhra Pradesh / Anakapally : హెచ్.ఐ.విపై అవగాహన సదస్సు యలమంచిలి, న్యూస్ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో మీకు తెలుసా అనే కార్యక్రమం మంగళవారం డిస్టిక్ రిసోర్స్ పర్సన్ ఎస్. గోవిందరావు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్.ఐ.వి. మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్రజల్లో అవగాహన పెంపొందించెందుకు 2 నెలల పాటు నాకో నేత్రత్వంలో "మీకు తెలుసా" కార్యక్రమాన్ని జిల్లా స్థాయి ఇంటెన్సిఫైడ్ ఐ ఇ సి క్యాంపెయిన్ ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా జనాభాలో హెచ్ ఐవి మరియు సుఖవ్యాధులు (ఎస్టీ .ఐ.ల గురించి పరిజ్ఞానం, అవగాహన మరియు హెచ్.ఐ.వి. ఉన్నవారి పట్ల వివక్ష తగ్గించేందుకు, ప్రజల్లో అవగాహన కలిగించి తద్వారా ఎక్కువ మంది హెచ్. ఐ.వి. పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా నేకో ఆదేశాలకనుగుణంగా, హెచ్ఐవి, ఎయిడ్స్ (ప్రివెన్షన్ కంట్రోల్) యాక్టు -2017 గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి మండలంలో రామభద్రపురం, రుక్మిణిపురం, పురుషోత్తపురం గ్రామంలో జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు డి. శోభారాణి, ఇంచార్జ్ ఎం. సత్యనారాయణ, హై స్కూల్ స్టాప్ లింక్ వర్కర్ సూపర్వైజర్ డి. రమణ, ఎస్. భవాని, వై. అప్పలనర్స తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV