Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి రాపిడ్ టీవీ:: *కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ గౌ.శ్రీ.యు.సుకుమార్ వర్మ (తేజ ) అన్నారు. రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెం మైనర్ బాలిక హత్య కు స్పందిస్తూ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ఐదు లక్షల చెక్కును శుక్రవారం వైయస్సార్ పార్టీ ఎలమంచిలి కార్యాలయంలో బాధితురాలు కుటుంబం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్యకు గురైన బద్ది దర్శినిను గత కొంతకాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నా, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసి పోలీసులు పట్టించుకోకపోవడంతో హత్య జరిగిందని విమర్శించారు. దర్శిని కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సమస్యలపై వైయస్సార్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొద్దపు గోవిందు,యలమంచిలి పార్టీ అధ్యక్షులు ఎర్రయ్య దొర ,రాంబిల్లి జడ్పిటిసి డి నాగరాజు,రాంబిల్లి పార్టీ అధ్యక్షులు కిషోర్, యలమంచిలి మండల పార్టీ అధ్యక్షులు కే త్రినాథ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏ గుప్తా పార్టీ నాయకులు అంకిరెడ్డి నరసింహారావు, వెంకట సూరి మాస్టారు. పిల్లా త్రినాధ్,దూది నరసింహమూర్తి, పిట్టా సత్తిబాబు. రాపిటి సంతోష్. వి గోపి. శేఖర్ బాబు. మాబు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV