Rapid TV - Andhra Pradesh / Anakapally : *సి.బి.సి.ఐ ఓ ఆర్.టి.ఐ ఫోరమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా సేనాపతి లోవరాజు* అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సేనాపతి లోవరాజు ను కంట్రోల్ బోర్డ్ ఆఫ్ కరప్సన్ ఇన్ ఆక్టోపస్ ఆర్.టి.ఐ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమించబడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు కుప్పిలి శివ ప్రసాద్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి.వి.సత్యనారాయణ చేతుల మీదగా అనకాపల్లి జిల్లా ,ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు లో 16.02.2024 శుక్రవారం నాడు సేనాపతి లోవరాజు కి పదవి బాధ్యత నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో అవినీతి ,అక్రమాలపై పోరాటం చేస్తానని సేనాపతి లోవరాజు స్పష్టం చేశారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ స.హా చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ఆ దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీఐఓ నాయకులు ,సభ్యులు పాల్గొన్నారు.
Admin
Rapid TV