Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం :అభం శుభం తెలియని ఒక చిన్నారి ని అతి కిరాతకంగా చంపిన ముద్దాయికి చోడవరం కోర్ట్ ఉరిశిక్ష ఖరారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి లో వేపాడ మురుగన్ అతని భార్య ధనలక్ష్మి హోటల్ నడుపుతూ ఉండేవారు. వీరికి దివ్య యు కె జి చదువు తున్న ఆరు సంవత్సరాలు కుమార్తె కూడా ఉంది. హోటల్లో పనిచేయడానికి వరుసకు తమ్ముడైనటువంటి గుణశేఖర్ ను పనిలో పెట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత గుణశేఖర్ తో విభేదాలు రావడంతో అతనిని పనిలోంచి తీసివేశారు. ఈ విషయమై వారిపై కక్ష పెంచుకున్న గుణశేఖరు వారి కుమార్తె దివ్య ను స్థానిక ఉషోదయ స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో అటకాయించి మాయ మాటలు చెప్పి చాక్లెట్ కొంటానని 20 రూపాయలు చేతిలో పెట్టి సమీప రైవాడ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలోని కొండ మెట్ట ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ బీరు బాటిల్ చితక్కొట్టి బాలికను అతి క్రూరంగా హత్య చేశాడు. ఈ సంఘటన 2015 లో జరిగింది. అప్పటి పోలీసులు కేసు నమోదు చేయగా నేడు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టులో ముద్దాయికి న్యాయ మూర్తి ఉరి శిక్షను ఖరారు చేసారు. చోడవరం కోర్ట్ చరిత్రలోనే మొట్టమొదటి ఉరిశిక్ష కేసు.
Admin
Rapid TV