Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : పాయకరావుపేట లో పాండురంగ స్వామి దేవాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత తన కుమారుడు నిఖిల్ , కుమార్తె రేస్మిక లతో కలసి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం పాయకరావుపేట టౌన్ లో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హోం మంత్రి అనిత కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేశారు. అనిత వారందరినీ పేరు పేరు నా అభివాదం చేస్తూ ప్రతీ ఒక్కరికీ కరాచలనం చేశారు. కూటమి నాయకులు పాయకరావుపేట లో అడుగడుగునా గజ మాలలతో ఘన స్వాగతం పలికారు. పాయకరావు పేట వై.జంక్షన్ నుండి ర్యాలీ గా బయలుదేరిన ఆమె కు జనం నీరాజనాలు పట్టారు. జాతీయ రహదారిపై ర్యాలీగా వెళుతున్న హోం మంత్రి అనిత ను చూడడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రతీ గ్రామం వద్ద జన నీరాజనాలతో పాయకరావు పేట నియోజకవర్గం హోరెత్తింది. ఈ విజయోత్సవ ర్యాలీ నక్కపల్లి ,అడ్డురోడ్డు ,ధర్మవరం మీదుగా 25 కిలోమీటర్ల మేర కొన సాగింది..ఈ విజయోత్సవ ర్యాలీ అనంతరం నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కు ఆలయ సాంప్రదాయ రీతిలో ఆలయ ఉద్యోగులు పండితులు స్వాగతం పలికారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనిత కు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు అనంతరం రాత్రి 11 గంటల సమయానికి నక్కపల్లి మండలంలోని సారిపల్లి పాలెం క్రిష్ టౌన్ షిప్ లో గల స్వగృహం కు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సి.ఐ లు నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న ,నక్కపల్లి ఎస్.హెచ్ ఓ విజయకుమార్ పాయకరావుపేట ఎస్ హెచ్.ఓ ,అప్పలరాజు లతో పాటు ఎస్.రాయవరం ఎస్.ఐ విభూషణ రావు లు ఈ విజయోత్సవ ర్యాలీ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Reporter
Rapid TV