Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండల కేంద్రం రావికమతం జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ప్రాంగణంలో సర్వశిక్షా అభియాన్ నిధుల్లో తో వాలీబాల్ కోర్టు పనులకు భూమి పూజ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సందర్భంగా స్కూల్ చైర్మన్ అప్పారావు మాట్లాడుతూ మండలంలో ఒకే ఒక్క పాఠశాలకు నిధులు మంజూరయ్యాయని అవి మా పాఠశాలకు మంజూరు చేయడం పట్ల హ ర్షం వ్యక్తం చేస్తున్నామని చోడవరం శాసన సభ్యులు కే ఎస్ యన్ ఎస్ రాజుకు స్థానిక కూటమి నాయకులకు పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావుకు కాపు కార్పొరేషన్ డైరెక్ట్ రాజాన కొండ నాయుడు తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం లో స్థానిక స్కూల్ చైర్మన్ భూసాల అప్పారావు స్థానిక సర్పంచి మంగమోదినాయుడు ఎంపీటీసీ వేపాడ నాగేశ్వరరావు నెట్ శ్రీను పులిగాయల సత్యన్నారాయణ, కూటమి నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Admin
Rapid TV