Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: మండలంలో బిజెపి పార్టీ బలోపేతం చేయండి యలమంచిలి పట్నంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల సమావేశం నిర్వహించారు. బిజెపి పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు రాజన్న సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేష్, జి వి ఎస్ ఎన్ వర్మ లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలమంచిలి మున్సిపాలిటీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చంటి వేయడం జరిగిందని ఈ కమిటీ సభ్యులుగా పప్పు ఈశ్వరరావు, రామకృష్ణ రాజు, పెట్ట దాసు బాబు లను ప్రకటించడం జరిగిందని అన్నారు. రాబోవు స్థానిక సంస్థలు ఎన్నికలకు బిజెపిని బలోపేతం చేయడానికి పార్టీ క్యాడర్ గట్టిగా కృషి చేయాలని కోరారు. సెప్టెంబర్ ఒకటి నుంచి 25 వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోకన్వీనర్ నక్కా శివశంకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గొర్రెల నగేష్, బద్ధపు శివ మనోహర వీర రమణ, ఎం కృష్ణ, లాయర్ సతీష్, నాగేశ్వరరావు, మానేపల్లి హరిబాబు, జయంత్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV