Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండలంలోని పులఖండం పొన్నఓలు గ్రామంలో సీసీ రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పల్లె వెలుగు 2.0 కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామ తే దే పా అధ్యక్షుడు పినపాత్రుని అంజి సీనియర్ తెదేపా నాయుకులు తమ్మిరెడ్డి నాగేశ్వరరావు రమణ తదితరులు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులకు 15 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించిన చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజుకి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు మండల పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావు ఎంపిటి సి కొసిరెడ్డి అప్పారావు మరియు కూటమి నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. పంచాయతీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాలని కోరుతున్నట్లుగా తెలిపారు.
Admin
Rapid TV