Wednesday, 10 December 2025 07:29:06 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

చంద్రబాబు రాకతో రాష్ట్రంలో ప్రజా పాలన:: మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు

Date : 14 June 2024 07:29 PM Views : 579

Rapid TV - Andhra Pradesh / Anakapally : చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం - మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర రావు అనకాపల్లి, రాపిడ్ టీవీ జూన్ 14: చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు అన్నారు. శుక్రవారం లక్ష్మీనారాయణ నగర్ లోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను రాష్ట్రవ్యాప్తంగా కబ్జా చేయాలనే దురుద్దేశంతో జగన్ ప్రవేశపెట్టిన భూ యాజమాన్య చట్టాన్ని చంద్రబాబు రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న తమ ఆస్తులను జగన్ కబ్జా చేస్తాడనే భయంతో రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా తమ సొంత ఖర్చులతో వచ్చి జగన్ ను ఓడించడానికి ఓట్లు వేశారన్నారు. ఈ చట్టం ప్రకారం వైసీపీ నాయకులకు భూకబ్జాలను చేసే అధికారం ఇచ్చి సివిల్ కోర్టులకు కూడా అధికారాలు తొలగించారన్నారు. ప్రపంచం మొత్తం మీద కోర్టులకు అధికారాలను తొలగించిన ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు. చంద్రబాబు అన్నట్టుగా ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్ ప్రజలకు నేర్పాడని అన్నారు. ప్రజల పేదరికాన్ని గుర్తించి మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగువేలకు పెంచుతూ దీనికి ఎన్టీఆర్ భరోసా అనే పేరును కూడా పెట్టడం జరిగిందన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ ని పెడతామని హామీ ఇచ్చిన జగన్ డీఎస్సీ పెట్టలేదు సరి కదా సుమారు పదివేల గ్రామస్థాయి ప్రాథమిక పాఠశాలలను నిర్దాక్షిణ్యంగా మూసివేసారన్నారు. దానివలన గ్రామీణ విద్యార్థులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లలేక చదువు మానివేసి కూలీ పనులలో నిమగ్నమయ్యారన్నారు. చంద్రబాబు ఒకేసారి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను నియమించడానికి మెగా డీఎస్సీ ని ప్రకటించడం నిరుద్యోగులకు ఒక వరం అన్నారు. క్రమంగా పరిపాలన వ్యవహారాలను విభాగాలు శాఖల వారీగా సమీక్షించి గత ఐదు ఏళ్లలో జరిగిన అక్రమాలను భూకబ్జాలపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటారని అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల లోపల జగన్ కు తనతో మిగిలిన ప్రజా ప్రతినిధులు జ్ఞాపకం వచ్చారన్నారు. శిశుపాలుడు తప్పులను లెక్కపెట్టినట్టు తెలుగుదేశం తప్పులను లెక్కపెట్టమని వారికి ఆదేశాలు ఇచ్చారన్నారు. జగన్ తప్పులను లెక్కపెట్టడం చేతకాక ఐదేళ్ల తప్పులకు పరిష్కారంగా జగన్ ను ప్రజలు ఓడించారన్నారు. అధికారంలో ఉన్నంతసేపు బ్రోకర్లను, డాక్టర్లను, కబ్జాదారులను ప్రోత్సహించి సుమారు 75% తన ప్రజా ప్రతినిధులను కలవడానికి గాని, మాట్లాడడానికి గాని నిరాకరించాలన్నారు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు కానీ చెవులు ఉండేవని, కానీ కళ్ళు చెవులు కూడా జగన్ కి లేవన్నారు. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ఆస్తులకు, ప్రజలకు చక్రవర్తిని అనే భావంతో ప్రజలకు నరకం చూపించినందుకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఆయన చేసిన అక్రమాలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్సీలతో శాసనమండలి సభ్యులతో శాసనమండలిలో తమకు మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని నడవనీయకుండా అన్ని విధానాలను అడ్డుకోమని యత బోధ చేశారన్నారు. ప్రధానంగా చంద్రబాబు రద్దు చేసిన భూ యాజమాన్య చట్టం శాసనసభ ఆమోదం పొందిన తరువాత శాసనమండలిలో వ్యతిరేకించమని కూడా ఆదేశాలు ఇచ్చారన్నారు. పదవి పోయినా తన విధానాలను మార్చుకోకుండా ఓడినా కూడా ప్రజలపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి తన పార్టీకి ఆదేశాలు ఇవ్వడం దురదృష్టకరమని మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు గారు అన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2025. All right Reserved.



Developed By :