Saturday, 13 June 2026 11:08:33 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

రావికమతంలో ట్రాఫిక్ సమస్య

Date : 14 January 2026 05:01 PM Views : 197

Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతంలో ట్రాఫిక్ సమస్య రాపిడ్ టివి రావికమతం : మండల కేంద్రం రావికమతంలో ట్రాఫిక్ సమస్య వాహన చోదకులకు, పాదచారులకు సంకటంగా మారింది. రావికమతం మండల కేంద్రం ఇటు బుచ్చయ్యపేట మాడుగుల రోలుగుంట మండలంలోని కొన్ని గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. పండగ సమయం కావడంతో ప్రధాన కేంద్రం రద్దీగా మారింది. ఎర్రవాయి ప్రాంతం నుంచి వచ్చే వాహనాలు నర్సీపట్నం చోడవరం వైపు వెళ్లే వాహనాలు మూడు రోడ్లు కూడలిలో రద్దీగా మారాయి. సుదూర ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాలకు వచ్చే వాహనాలు ఇక్కడ ఎక్కువ సమయం నిలిచిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాపారులు పూర్తిగా బియన్ రోడ్డుపైనే షాపులు ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని వాహన చోదకులు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో కారు బీభత్సంతో పలువురు మృతి చెందిన సంఘటన మళ్లీ పునరావతం అవుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు చిన్న రోడ్డు ఉన్నప్పుడే ఇక్కడ ట్రాఫిక్కు బాగుండేదని ఇప్పుడు డబల్ రోడ్డు అయిన తర్వాతే ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయని చర్చించుకుంటున్నారు. రోడ్లపై షాపులు పెట్టడంతో ద్విచక్ర వాహనాలు ఆటోలు పూర్తిగా రోడ్లపైనే విడిచిపెట్టి వారి వారి పనులను చక్కబెట్టుకుంటున్నారు. గతంలో పండగ సమయాలలో రావికమతం పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఏ ఎస్ఐ క్యాడారు ఒక లేడీ కానిస్టేబుల్ ఒక హోంగార్డు మరో ఇద్దరు కానిస్టేబుల్ తో ఇక్కడ ట్రాఫిక్ ను నియంత్రించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది కనీసం ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ అధికారులు చొరవ తీసుకొని సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను షాప్ లను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :