Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, పార్లమెంటరీ రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ గారి జన్మదినం సందర్బంగా అనకాపల్లి పట్టణం, విజయరామరాజు పేటలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు 82వ వార్డు టీడీపీ ఇంచార్జీ పొలారపు త్రినాధ్ మరియు 83వ వార్డు టీడీపీ ఇంచార్జీ బొద్దపు ప్రసాద్ గారు సహకారంతో సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ అనకాపల్లి, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం & రాజా ఆప్టీకల్స్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర , ఎంపీ కార్యాలయం ఇంచార్జీ విజయ్ లు కలిసి ప్రారంభించారు.ఈ వైద్య శిబిరంలో సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ కంటి డాక్టర్ పి.అరుణ కంటి పరీక్షలు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులను పంపిణి చేశారు. ఈ శిబిరంలో 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 25 మంది ఆపరేషన్ల కు ఎంపికయ్యారు. 40 మందికి కంటి అద్దాలు అవసరం గుర్తించి వారికి అనకాపల్లి రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రిలో 50% రాయితీతో కంటి అద్దాలు అందజేస్తామని పూసర్ల రాజా తెలియజేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని రాజా ఆప్టికల్ అండ్ కంటి ఆసుపత్రి అధినేత పూసర్ల రాజా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు, గ్రామ కమిటీ పెద్దలు పాల్గొన్నారు.
Admin
Rapid TV