Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకులోయ రాపిడ్ టీవీ:: అరకులోయలో పారిశుద్ధ్య పక్షోత్సవాలు ర్యాలీ అరకులోయ లో శనివారం పారిశుద్ధ్య పక్షోత్సవాలు ర్యాలీ జరిగింది. స్థానిక ఎంపీడీవో వెంకటేష్, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా కొనసాగింది. పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ప్లాస్టిక్ ను నిషేధించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ , డయేరియా వంటి వ్యాధులు నివారణే లక్ష్యమన్నారు. పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యతని ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేష్, సర్పంచ్ దాసుబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈవో రాజ్ కుమార్ , పంచాయతీ పాలకవర్గం సభ్యులు , టిడిపి నాయకులు నాగరాజు, చందు పాడి తదితరులు పాల్గొన్నారు .
Reporter
Rapid TV