Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా :ఎలమంచిలి నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు కొలుకులూరు విజయబాబు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాజాన సూర్య నాగేశ్వరరావు,మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి రాజు, గొర్లి నానాజీ, మేరుగు బాపు నాయుడు, రాజాన నారాయణమ్మ, కొటారు సాంబ, సేనాపతి నాగేశ్వరరావు, ఆడారి ఆదిమూర్తి, బొద్ధపు శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు, పొనమల్ల కొండబాబు,యాండ్ర అప్పలనాయుడు, ఎరిపిల్లి చిట్టిబాబు, లాలం రాజు,నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV