Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్కతాలోని ఆర్ కార్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచారాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ (ఐఎంఏ) వైద్య సేవల బంద్ కుపిలుపునిచ్చింది. ఈ సందర్భంగా యలమంచిలి సిహెచ్ సి ఆధ్వర్యంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. డాక్టర్ సురేఖ మాట్లాడుతూ కోల్కతాలోని ఆర్ కార్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం చేసి అతి కిరాతకంగా హతమార్చారని వైద్య విద్యార్థినికి తగు న్యాయం చేయాలని, నిందుతులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్స్ అందర్నీ సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ చట్టంలో తీసుకురావాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ వైద్య విద్యార్థినికి తగు న్యాయం చేయాలని నిందుతులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.
Reporter
Rapid TV