Rapid TV - Andhra Pradesh / Anakapally : అన్ని గ్రామాలలో ధార్మక కమిటీలు ఉండాలి యలమంచిలి/రాంబిల్లి, : దేవాలయాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించటానికి, ధర్మపరిరక్షణ కొరకు ప్రతీ గ్రామములోను గ్రామధార్మిక కమిటీలు ఏర్పాటు కావాలని సమరసతా సేవ ఫౌండేషన్ యలమంచిలి ఖండ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు అన్నారు. రాంబిల్లి మండలంలో కమిటీ సమావేశం స్థానిక శ్రీ పైడితల్లమ్మ ఆలయంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేవాలయ కేంద్రంగా వారం వారం భజన, ప్రతి పౌర్ణమికి సామూహిక హారతి, ఏకాదశి నాడు నగర సంకీర్తన ,ప్రతి రెండవ శనివారం సత్సంగం ఖశ్చతంగా జరుగుతూ ఉండాలని సమరసత సేవా ఫౌండేషన్ మండల సంయోజకులు సూరాడ నూకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఖండ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు, సంయోజకులు సూరాడ నూకరాజు, చింతకాయలు గగన్ కుమార్, శేశెట్టి అప్పారావు, చక్రవర్తి, కారే రాముడు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV