Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి :: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ *కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా శనివారం అనకాపల్లి పార్లమెంట్ టీడీపి కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి మరియు నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి & మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధ నాగ జగదీశ్వరరావు గారు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు దాడి రత్నాకర్ గారు, గవర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మళ్ళ సురేంద్ర గారు, కొట్ని బాలాజీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు అనీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, తెలుగుజాతి ఖ్యాతినీ ప్రపంచం నలుమూలలకు పరిచయం చేసి, తెలుగుదేశం అనే పార్టీనీ స్థాపించి ప్రజాసేవ,రాజకీయం అంటే ఏంటో సాధారణ ప్రజలకు కూడా తెలియజేసి తెలుగు వారి ప్రతిభను అందరూ గర్వించే స్థాయికి నిలబెట్టిన ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించి పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం వెల్పులవీధి శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరులును దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Rapid TV