Rapid TV - Andhra Pradesh / Anakapally : *భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని వినతి.* *వై.సి.పి జే.సి ఎస్ కో ఆర్డినేటర్ సురకాసుల గోవింద్* పాయకరావుపేట : నక్కపల్లి మండలంలోని ఏ. పి.ఐ. ఐ. సి లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ని వై.ఎస్.ఆర్ సి.పి జే.సి.ఎస్ కో ఆర్డినేటర్ సురకాసుల గోవింద్ కోరారు.శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నక్కపల్లి మండలంలో ఏ.పి.ఐ. ఐ. సి లో భూములు కోల్పోయిన రైతులు కు రావాల్సిన పెండింగ్ పేమెంట్ గురించి తెలియజేయడం జరిగిందన్నారు.అలాగే ఆర్.అండ్.ఆర్ ప్యాకేజి కూడా ఇప్పించాలని కోరామన్నారు.దీంతో పాటు కాగిత నుండి పాటిమీద వరకు ప్రపోజ్ చేస్తున్న ఏ. పి.ఐ. ఐ. సి రోడ్ లో భూములు కోల్పో తున్న రైతుల భూములుకు రైతులుకు నష్టo లేకుండా నష్ట పరిహారం ఇప్పించవలసినదిగా కోరడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామరావుతో పాటు ,వైస్సార్ సి.పి కాగిత సర్పంచ్ పోతం శెట్టి పోతారాజేష్ లతో కలిసి పలు సమస్యల పై వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు.
Reporter
Rapid TV