Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఎన్నుకోబడింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యవర్గ ఎన్నికలలో కమిటీ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా టి.రమేష్, అధ్యక్షునిగా శశి కుమార్, కార్యదర్శి గా నాగా శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గా సతీష్, జాయింట్ సెక్రటరీ గా పి సురేష్, కోశాధికారి గా ఎం గంగాధర్ లు ఎన్నిక కాబడ్డారు. సభ్యులుగా బొడ్డేడ అప్పారావు, పీ భోగి లింగం, వై సురేష్ కుమార్, వాసిరెడ్డి రాజు, బి ఫణీంద్ర, ఎస్ హనుమంతరావు, ఆర్ శ్రీనివాసరావు, ఏ సంజీవ్ లు నియమింపబడ్డారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్ష కార్యదర్శులు కొండలరావు, రామకృష్ణ, ఎక్రెడిషన్ కమిటీ సభ్యులు భాష, టి రమేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Rapid TV